Ad Code

Responsive Advertisement

indira soura giri jala vikasam scheme in telugu 2025/ఇందిర సౌర గిరి జల వికాసం పథకం 2025

 indira soura giri jala vikasam scheme in telugu 2025/ఇందిర సౌర గిరి జల వికాసం పథకం 2025


indira soura giri jala vikasam scheme in telugu 2025/ఇందిర సౌర గిరి జల వికాసం పథకం 2025



  గిరిజన రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు తెలంగాణ ప్రభుత్వం indira soura giri jala vikasam scheme పథకాన్ని తీసుకువచ్చింది. ఈ indira soura giri jala vikasam scheme in telugu పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ కర్నూల్ జిల్లా మాచారంలో మే 19, 2025 వ తేదీ సోమవారం నాడు ప్రారంభించనున్నారు.


  ఈ పథకం యొక్క ఉద్దేశం పోడు భూములను వ్యవసాయ భూములుగా తీర్చిదిద్దడం. ఈ ఇందిరా సౌర గిరి జలవికాసం పథకం ద్వారా కరెంటు వసతి లేని భూములకు సోలార్ పంపుసెట్లు పెట్టించి భూములకు నీరు అందించనున్నారు.


  ఈ indira soura giri jala vikasam పథకం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 12,600 కోట్ల రూపాయలను రానున్న 5 సంవత్సరాలలో ఖర్చు పెట్టనుంది. తెలంగాణ రాష్ట్రంలో RoFR(అటవీ హక్కుల చట్టం - 2006) కింద 6.69 లక్షల ఎకరాల విస్తీర్ణ పోడు పట్టా భూములు ఉన్నాయి. ఈ 6.69 లక్షల ఎకరాల భూమి 2.30 లక్షల గిరిజన రైతుల పేరు మీద ఉన్నాయి. ఈ 6.69 లక్షల ఎకరాలలో నీటి సౌకర్యం లేని 6 లక్షల ఎకరాలకు ఈ indira soura giri jala vikasam పథకం వర్తించనుంది.


TG Polycet Results 2025 in telugu


  గిరిజన రైతు 2.5 ఎకరాల భూమి లేదా అంతకన్నా ఎక్కువ భూమిని కలిగి ఉంటే ఒక యూనిట్ మంజూరు చేస్తారు. గిరిజన రైతులు 2.5 ఎకరముల భూమి కన్నా తక్కువ భూమిని కలిగి ఉంటే సమీప రైతును కలుపుకొని ఇవ్వడం జరుగుతుంది. యూనిట్ ఖర్చు 6 లక్షల రూపాయలకు మించకూడదు.


  మే 25, 2025 వ తేదీ లోపు అర్హులైన ఎస్టీ రైతులను గుర్తిస్తారు. భూగర్భ జలాల సర్వే మరియు ఇతర పనులను జూన్ 10 లోపు గిరిజన సంక్షేమ శాఖ చేస్తుంది. జూన్ 25, 2025 వ తేదీ నుండి మార్చి 31, 2026 వ తేది వరకు బోరు బావుల తవ్వకం, సోలార్ పంపుసెట్లను ఏర్పాటు చేయడం లాంటి పనులను పూర్తి చేస్తారు. 


  ఈ మొదటి సంవత్సరం 10,000 మంది రైతులకు చెందిన 27,184 ఎకరాల భూమిని అభివృద్ధి చేయనున్నారు. ఈ 27,184 ఎకరాల భూమి అభివృద్ధికి మొదటి సంవత్సరం 600 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు.


indira soura giri jala vikasam scheme 2025


  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025 - 2026 సంవత్సరానికి సంబంధించి 10,000 రైతుల యొక్క 27,184 ఎకరాల పోడు భూమిని అభివృద్ధి చేయుటకై 600 కోట్లు ఖర్చు చేయనుంది. 

2026 - 2027 సంవత్సరానికి సంబంధించి 50,000 రైతుల యొక్క 1,43,204 ఎకరాల పోడు భూమిని అభివృద్ధి చేయుటకై 3000 కోట్లు ఖర్చు చేయనుంది. 

2027 - 2028 సంవత్సరానికి సంబంధించి 50,000 రైతుల యొక్క 1,43,204 ఎకరాల పోడు భూమిని అభివృద్ధి చేయుటకై 3000 కోట్లు ఖర్చు చేయనుంది. 

2028 - 2029 సంవత్సరానికి సంబంధించి 50,000 రైతుల యొక్క 1,43,204 ఎకరాల పోడు భూమిని అభివృద్ధి చేయుటకై 3000 కోట్లు ఖర్చు చేయనుంది. 

2029 - 2030 సంవత్సరానికి సంబంధించి 50,000 రైతుల యొక్క 1,43,204 ఎకరాల పోడు భూమిని అభివృద్ధి చేయుటకై 3000 కోట్లు ఖర్చు చేయనుంది. 

  మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2,10,000 రైతుల యొక్క 6,00,000 ఎకరాల భూమిని అభివృద్ధి చేయుటకై 5 సంవత్సరాలలో 12,600 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టనుంది.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు