AP IIIT 2025 Results merit list In Telugu: ఏపీ త్రిబుల్ ఐటీ merit list
Rajiv Gandhi University of knowledge technologies, Andhra Pradesh. AP IIIT 2025 results merit list ను జూన్ 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రకటించనున్నారు. ఈ AP IIIT 2025 కోసం 50,541 విద్యార్థులు అప్లై చేసుకున్నారు. ఇప్పుడు విద్యార్థులు AP IIIT 2025 results merit list కోసం విద్యార్థులు ఎదురుచూస్తూ ఉన్నారు.
ఈ AP IIIT 2025 లో సీటు సంపాదించిన విద్యార్థులకు నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం లోని AP IIIT 2025 కళాశాలలో సీటు ఇవ్వడం జరుగుతుంది. ఈ AP IIIT 2025 కోసం 50,541 అప్లికేషన్లు రావడం జరిగింది. ఈ AP IIIT 2025 Results merit list జూన్ 5వ తేదీ రిలీజ్ అవుతాయి.
మే 28, 29 - 2025 వ తేదీల్లో సైనిక ఉద్యోగుల కోట విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు.
మే 28 నుండి 30 తేదీల మధ్య క్రీడా కోట కింద క్రీడా విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించమన్నారు.
మే 29, 2025 వ తేదీన భారత స్కాట్స్ అండ్ గైడ్స్ కోటా విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు.
మే 29 నుండి 31 వరకు ఎన్సిసి కోట అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించనున్నారు.
పదవ తరగతి విద్యార్థుల కోసం Vidhyadhan Scholarship 2025
మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో నీ AP IIIT నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం కాలేజీల్లో 4,400 సీట్లు ఉన్నాయి. ఈ AP IIIT 2025 Compitition చూస్తే మొత్తం గా 50,541 అప్లికేషన్స్ వచ్చాయి. అంటే కాంపిటీషన్ అనేది దాదాపు ఒక సీటుకు 12 మంది ఉన్నారు. విద్యార్థులను ఆంధ్రప్రదేశ్ త్రిబుల్ ఐటీ కి తమ పదవ తరగతిలో వచ్చిన మార్కులను ఆధారంగా తీసుకొని మెరిట్ లిస్టు తీసి ఇవ్వడం జరుగుతుంది. ఈ త్రిబుల్ ఐటీ కి సెలెక్ట్ అయిన విద్యార్థులకు ఇంటర్ రెండు సంవత్సరాల తో పాటు బీటెక్ నాలుగు సంవత్సరాల కోర్సును ఉచితంగా చెప్పడం జరుగుతుంది. మొత్తంగా ఇంటర్ నుండి బీటెక్ వరకు ఆరు సంవత్సరాల చదువును ఈ AP IIIT 2025 సీటు సంపాదించిన వారికి ఉచితంగా చెప్పడం జరుగుతుంది.
AP IIIT 2025 Results merit list In Telugu:
మొత్తంగా AP IIIT 2025 Cet కి అప్లై చేసుకున్న 50,541 మంది యొక్క మెరిట్ లిస్టు ను జూన్ 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు ప్రకటిస్తారు.
నూజివీడు, ఇడుపులపాయ కు సెలెక్ట్ అయిన విద్యార్థులకు జూన్ 30వ తేదీ, జులై 1వ తేదీన డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆయా క్యాంపస్ లో జరుగుతుంది.
శ్రీకాకుళం త్రిబుల్ ఐటీ కి సెలెక్ట్ అయిన విద్యార్థులకు జూలై 2వ తేదీ, జులై 3వ తేదీన అలాగే ఒంగోలు త్రిబుల్ ఐటీ కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు జూలై 4 వ తేదీ, జులై 5వ తేదీ న ఏలూరు జిల్లాలోని నూజివీడు త్రిబుల్ ఐటీ లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
జూలై 14వ తేదీ నాటికి అడ్మిషన్లు పొందిన విద్యార్థులు వారి కాలేజీల్లో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
Official Website: https://www.rgukt.in/
0 కామెంట్లు