Thalliki vandanam/Amma vadi/ Scheme in telugu 2025: తల్లికి వందనం, అమ్మవడి 15,000.
Thalliki Vandanam (తల్లికి వందనం) (Amma vadi) కింద ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలను ఒకటవ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు జూన్ 12వ తేదీన జమ చేయనుంది. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే, అర్హత కలిగిన అందరికీ ఈ 15000 జమా కానుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించనున్నారు.
పేదరికం కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదు అనే ఉద్దేశంతో ఈ Thalliki Vandanam (తల్లికి వందనం) పథకాన్ని ప్రారంభించానున్నారు.
గతంలో వైయస్సార్ ప్రభుత్వం Amma vadi (అమ్మ వడి) పథకం పేరు మీద ఒకటవ తరగతి నుండి 12 వ తరగతి వరకు చదివే విద్యార్థులకు 15వేల రూపాయలను అందించేది. అయితే గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం కుటుంబంలోని కేవలం ఒక విద్యార్థికి మాత్రమే ఈ 15 వేల రూపాయలను అందించేది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ ఈ పథకం ద్వారా ఒక్కో విద్యార్థికి 15000 రూపాయలను అందించనుంది.
మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటవ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న అర్హత కలిగిన 67,27,164 మంది విద్యార్థులకు ఈ 15 వేల రూపాయలను తల్లికి వందనం పథకం పేరు మీద జూన్ 12వ తేదీన విద్యార్థుల తల్లుల అకౌంట్ లో జమ చేయనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా తల్లికి వందనం పథకం కు అర్హత కలిగిన 67,27,164 విద్యార్థుల తల్లుల అకౌంట్ల లో మొత్తంగా 8,745 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం జమ చేయనుంది.
సూపర్ సిక్స్ పథకాల్లో పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం 2 పథకాలను అమలు చేశామని లోకేష్ గారు ట్వీట్ చేశారు. ఈ తల్లికి వందనం పథకం అమలుతో ముఖ్యమైన మరో హామీ నెరవేరుతుంది అని తెలిపారు.
ఈ తల్లికి వందనం పథకం రావాలి అంటే ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి. విద్యార్థులు ఒకటవ తరగతి నుండి 12వ తరగతి లోపు చదువుతూ ఉండాలి. విద్యార్థుల తల్లి కచ్చితంగా బ్యాంకు అకౌంటును కలిగి ఉండాలి. అలాగే కుటుంబ వార్షికాదాయం ప్రభుత్వ పరిమితికి లోబడి ఉండాలి.
0 కామెంట్లు