New Spouse Pension in AP 2025 june: నూతన వితంతు పెన్షన్లు
ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రంలో New Spouse Pension(నూతన వితంతు పెన్షన్) 4000 రూపాయలను వాయిదా వేయడం జరిగింది. ఈ New Spouse Pension(నూతన వితంతు పెన్షన్) ను ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం జూన్ 12, 2025వ తేదీన అందజేయాలి అని నిర్ణయించుకుంది, కానీ ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు సుపరిపాలన-స్వర్ణాంధ్ర కార్యక్రమానికి హాజరవుతున్న కారణంగా ఈ పెన్షన్లను వాయిదా వేయడం జరిగింది.
ఈ సుపరిపాలన-స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు.
అయితే ఈ నూతన పెన్షన్లను ఎమ్మెల్యేల చేతుల మీదుగా అందజేయాలి, ఎమ్మెల్యేలు సుపరిపాలన-స్వర్ణాంధ్ర కార్యక్రమానికి హాజరవుతున్న సందర్భంగా ఈ New Spouse Pension(నూతన వితంతు పెన్షన్) ను వాయిదా వేయడం జరిగింది. కొత్త తేదీని త్వరలో ప్రకటించనున్నారు.
ఈ New Spouse Pension(నూతన వితంతు పెన్షన్) ను రాష్ట్రవ్యాప్తంగా 71,340 మంది వితంతువులకు అందజేయనున్నారు. భర్త చనిపోయిన ఒంటరి మహిళలకు ఈ వితంతు పెన్షన్ను అందజేస్తారు.
ఈ వితంతు పెన్షన్ల కోసం ఇదివరకే అర్హత కలిగిన వారు అప్లై చేసుకున్నారు. ప్రభుత్వం గుర్తించిన అర్హత కలిగిన 71,340 మంది వితంతువులు అందరికీ నూతనంగా వితంతు పెన్షన్లను ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అందజేయనుంది. అయితే నూతన తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ఈ నూతన వితంతు పెన్షన్ల ద్వారా వితంతువులకు ప్రతినెల 4000 రూపాయలను అందించనున్నారు.
0 కామెంట్లు