Grievance For Thalliki Vandanam Scheme in Telugu 2025: డబ్బులు పడని వారు ఈ విధంగా చేయండి.
Thalliki Vandanam పథకానికి అన్ని అర్హతలు ఉండి, అకౌంట్లో డబ్బులు పడని వారు తమ గ్రామ సచివాలయంలో Grievance పెట్టుకోండి. ఈ Thalliki Vandanam Scheme Grievance ను జూన్ 12, 2025 వ తేదీ నుండి జూన్ 20, 2025 వ తేదీ లోపు పెట్టుకోవాలి.
Thalliki Vandanam పథకం ద్వారా 15,000 రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం జూన్ 12, 2025వ తేదీ నుండి తల్లుల అకౌంట్లో జమ చేసింది. ఈ తల్లికి వందనం పథకం ద్వారా 13,000 రూపాయలను తల్లుల అకౌంట్లో జమ చేసింది. 2000 రూపాయలను పాఠశాల నిర్వహణ ఖర్చులకు ఉంచుకుంది.
అయితే అన్ని అర్హతలు ఉండి ఈ తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు అందని వారు సచివాలయం దగ్గరకు వెళ్లి Grievance కు పెట్టుకోండి. మీరు Grievance పెట్టుకుంటే ప్రభుత్వం మిమ్మల్ని వెరిఫికేషన్ చేసి, మీరు నిజంగా అర్హతలు కలిగి ఉంటే కచ్చితంగా డబ్బులను మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది.
Thalliki Vandanam Grievance కి ఎలా పెట్టుకోవాలి?
ముందుగా సచివాలయం దగ్గరకు వెళ్లి అర్హత ఉన్న డబ్బులు పడలేదు, Grievance కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నాము అని అడగండి. వారు మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది.
అలాగే.. ఆధార్ జిరాక్స్, విద్యార్థి ఆధార్ జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్, విద్యార్థి ఐడి, బ్యాంకు బుక్ జిరాక్స్ అటాచ్ చేసి సచివాలయం లో ఇవ్వండి. సచివాలయం దగ్గర ఏదైనా సందేహం ఉంటే అడిగి తెలుసుకోండి.
సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి త్వరపడండి.
0 కామెంట్లు