Free Bus Scheme for Women in ap telugu: మహిళలకు ఉచిత బస్సు పథకం
Free Bus Scheme for Women in ap telugu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 15, 2025వ తేదీ నుండి Free Bus Scheme for Women ను ప్రారంభించానున్నారు. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలు ఉచితంగా ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించవచ్చు.
కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు తాము ఎన్నికలలో గెలిస్తే కొన్ని పథకాలను ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. ఆ పథకాలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి. అనుకున్న విధంగానే ఎన్నికలలో కూటమి ప్రభుత్వం భారీ మెజారిటీతో గెలిచింది.
మే 26, 2025వ తేదీ కడపలో జరిగిన మహానాడు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆగస్టు 15, 2025వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నట్టు తెలిపారు. అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద త్వరలోనే మూడు విడతల్లో 20,000 రూపాయలను రైతుల అకౌంట్లో జమ చేయనున్నట్లు తెలిపారు.
20,000 రూపాయలలో కేంద్ర ప్రభుత్వం 6000 రూపాయలను విడుతకు 2000 చొప్పున మొత్తంగా మూడు విడుతల్లో వేస్తుంది. మిగిలిన 14,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది.
Free Bus Scheme for Women in ap telugu 2025 పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మహిళలు తమ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. మహిళలు ఆధార్ కార్డు ను తీసుకునీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ బస్సు ను ఎక్కితే ఉచితంగా జిల్లా వ్యాప్తంగా ఎక్కడికైనా ప్రయాణించవచ్చు.
0 కామెంట్లు