Annadata Sukhibhava Scheme 2025 in telugu: త్వరలో రైతులకు 20,000.
Annadata Sukhibhava Scheme 2025 in telugu పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనీ అర్హత కలిగిన రైతులకు 20,000 రూపాయలను రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం అందించనున్నాయి. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం పేరుతో మూడు విడుదల్లో విడుతకు 2000 చొప్పున సంవత్సరానికి 6000 రూపాయలను అందించనుంది.
కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చన హామీల్లో ఈ Annadata Sukhibhava Scheme 2025 ఒకటి. ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతుల యొక్క ఖర్చులకు ప్రతి సంవత్సరం 20,000 రూపాయలను అందిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. ఈ Annadata Sukhibhava Scheme 2025 పథకం ద్వారా త్వరలోనే 20,000 రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతుల ఖాతాల్లో జమ చేస్తమని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు కడప మహాసభలో తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం 6000 రూపాయలను మరియు రాష్ట్ర ప్రభుత్వం 14000 రూపాయలను మొత్తంగా 20,000 రూపాయలను మూడు విడతల లో జమ చేయనున్నారు.
పదవ తరగతి ఇంటర్ క్వాలిఫికేషన్ తో Indian Air Force లో ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి ముఖ్య నారా చంద్రబాబు నాయుడు కడప మహానాడు సభలో ఎన్నికలలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని తెలిపారు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా త్వరలోనే 20,000 రూపాయలను జమ చేస్తామని తెలిపారు.
అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆగస్టు 15, 2025 వ తేదీ నుండి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో చెప్పిన విధంగానే సంపద పెంచి, అభివృద్ధికి ఖర్చు చేస్తామని తెలిపారు.
ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హులైన రైతుల పేర్లు విడుదల కావడం జరిగింది. మీ పేరు ఎలిజిబుల్ లిస్టులో ఉందో లేదో ఎలా చూసుకోవాలి అంటే ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి.
తర్వాత https://annadathasukhibhava.ap.gov.in/ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఆ వెబ్సైట్లో ఉన్న చెక్ స్టేటస్ పై క్లిక్ చేయండి.
తర్వాత రైతు యొక్క ఆధార్ నెంబర్, క్యాప్చ ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి. సెర్చ్ చేశాక రైతు యొక్క వివరాలు రావడం జరుగుతుంది. అర్హులైన రైతులు ఈ విధంగా కచ్చితంగా చెక్ చేసుకోండి. మీ పేరు వెరిఫై అయిందో, లేదో చూసుకోండి.
0 కామెంట్లు