Ad Code

Responsive Advertisement

Corona Cases in india 2025 in telugu: మళ్లీ కరోనా కేసుల విజృంభన

 Corona Cases in india 2025 in telugu: మళ్లీ కరోనా కేసుల విజృంభన


Corona Cases in india 2025 in telugu: మళ్లీ కరోనా కేసుల విజృంభన



  Corona Cases in india 2025 in telugu: కరోనా కేసు లు మళ్ళీ విజృంభిస్తున్నాయి. మే 19, 2025 వ తేదీ నాటికి భారతదేశవ్యాప్తంగా 257 కరోనా పాజిటివ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ 257 పాజిటివ్ కేసులు ఉన్నాయని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత వారం రోజులుగా భారతదేశంలో పాజిటివ్ కేసులు నమోదు అవుతూ వస్తున్నాయి.


  2019 లో చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచంలోని చాలా మందిని బలి తీసుకుంది. మొదటగా కరోనా కేసులు చైనాలో పాజిటివ్ రావడం జరిగింది. నెమ్మదిగా చైనా నుండి బయటికి వచ్చి ప్రపంచాన్ని మొత్తం పాకింది. ఎన్నడూ లేని విధంగా ప్రపంచం మొత్తాన్ని కుదిపేసింది. ఈ కరోనా వైరస్ కి చాలా కుటుంబాలు బలయ్యాయి. ఇదే ఆసరాగా చేసుకున్న చాలా ఆసుపత్రులు లక్షలు లక్షలు దోచుకున్నాయి. చాలా రోజులు ప్రభుత్వా లు లాక్ డౌన్ కూడా పెట్టడం జరిగింది. ఈ కరోన వైరస్ వల్ల చాలా దేశాల జిడిపి పడిపోయింది. చైనాలో పుట్టిన ఈ వైరస్ అనేక వేరియట్స్ గా రూపాంతరం చెందింది. వైరస్ ఇంక పోయింది లే అని అందరు బాగా ఉన్న సమయం లో మళ్ళీ పాజిటివ్ కేసులు వస్తున్నాయి.


AP New Ration Card Apply 2025


  ఈ కరోనా వైరస్ సోకిన వ్యాధిగ్రస్తులలో నీరసం, ముక్కు కారడం లేదా ముక్కుదిబ్బట, జ్వరం, పొడి దగ్గు, వాసన మరియు రుచి తెలవకపోవడం, తలనొప్పి, గొంతు నొప్పి లాంటి లక్షణాలు ఉంటాయి.


Corona Cases in india 2025 in telugu

  69 పాజిటివ్ కేసులు కేరళలో నమోదయ్యాయి. 44 పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. 34 పాజిటివ్ కేసులు తమిళనాడులో నమోదయ్యాయి. ఈ ముడు రాష్ట్రాల్లో అత్యధికంగా  పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కెఇఎం ఆసుపత్రి ముంబై లో 2 కరోనా మరణాలు నిర్ధరించబడ్డాయి.


 భారతదేశం మాత్రమే కాదు ప్రపంచంలో చాలా చోట్ల ఈ కరోనా కేసులు పెరుగుతున్నాయి. చైనాలోని హాంకంగ్ లో 31 కరుణ మరణాలు సంభవించాయి. అలాగే సింగపూర్ లో కరోన కేసుల శాతం చాలా పెరిగింది.


   రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారు, వృద్ధులు, అనారోగ్యంగా ఉండేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. పరిశుభ్రత పాటించాలి అని, రద్దీగా ఉండే ప్రదేశాలలో ఎక్కువగా తిరగరాదని, తరచుగా చేతులు కడగడం, మాస్కు ధరించడం చేయాలి అని నిపుణులు తెలియజేస్తున్నాను.


  అయితే భారతదేశం ప్రమాదంలో లేదు అని ప్రస్తుతం ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావలసిన అవసరం లేదు అని నిపుణులు చెబుతున్నారు. అయితే అతి నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం తప్పదు అని కూడా హెచ్చరిస్తున్నారు.


   రద్దీగా ఉండే ప్రదేశాలలో తిరిగే వారు తప్పనిసరిగా మాస్క్ ను వాడండి. వీలైతే శానిటైజర్ ని కూడా ఉంచుకోండి. మీ పరిసరాలలో పాజిటివ్ నమోదు అయితే ఆందోళన చెందవద్దు. మంచి బలమైన ఆహారం తీసుకోండి. అనుమానం ఉంటే కచ్చితంగా కరోనా పాజిటివ్ టెస్టును చేయించుకోండి. పాజిటివ్ వచ్చిన సరే ఎట్టి పరిస్థితుల్లో అసలు ఆందోళన చెందవద్దు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు